కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య

17 May, 2015 22:28 IST|Sakshi

మహబూబ్‌నగర్: కడుపునొప్పి  భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా రేగడి మైలారంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు..  గ్రామానికి చెందిన ప్రకాశ్ (18) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోంచి వెళ్లిన ప్రకాశ్ బావివద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపు నొప్పితోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అతని తండ్రి అంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు