ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఆదిలాబాద్ మండలం మావల గ్రామపంచాయతీ పరిధిలోని కేఆర్కే కాలనీకి చెందిన బషీర్ను దొంగతనం కేసులో విచారణ కోసం వన్టౌన్ పోలీసులు తీసుకొచ్చారు. మూడురోజులపాటు సేష్టన్లో ఉంచి విచారణ పేరిట తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.
దీంతో మనస్తాపం చెందిన యువకుడు శుక్రవారం పోలీస్స్టేషన్ ఆవరణలోని బాత్రూమ్కని వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. పోలీసులు హుటాహుటిన బషీర్ను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆస్పత్రికి వచ్చి సీఐ రఘవద్ద వివరాలు సేకరించారు. బషీర్ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.