‘మనూ’లో పారా మెడికల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

28 May, 2015 23:55 IST|Sakshi

హైదరాబాద్ : మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో పారా మెడికల్ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో చేరడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లో సర్టిఫికెట్ కోర్సులను, డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లో డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులను కోరుతున్నారు.  దరఖాస్తులను జూలై 2లోగా వర్సిటీలో సమర్పించాలి.

 
 

మరిన్ని వార్తలు