కొడుకా లొంగిపో..

22 Aug, 2015 02:28 IST|Sakshi
కొడుకా లొంగిపో..

మావోయిస్టు విద్యాసాగర్‌రెడ్డి తల్లిదండ్రుల వేడుకోలు
 
ధర్మసాగర్ : మండలంలోని కరుణపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మణికంటి విద్యాసాగర్‌రెడ్డి అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అతడి తల్లిదండ్రులు  సుధాకర్‌రెడ్డి-లత కోరారు. శుక్రవారం ధర్మసాగర్ ఠాణాలో సీఐ ఎ.రాజయ్య సమక్షంలో వారు విలేకరులతో మాట్లాడారు.

తమ కుమారుడు కుటుంబాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి తాము దుర్భరజీవితం గడుపుతున్నట్లు తెలిపారు. సీఐ ఎ.రాజయ్య మాట్లాడుతూ, విద్యాసాగర్ రెడ్డి లొంగిపోతే సాధారణ జీవనం గడిపేందుకు సదుపాయూలు కల్పిస్తామని చెప్పారు.  
 
 

మరిన్ని వార్తలు