యువకుడి గొంతు కోసి చంపిన మావోయిస్టులు

5 Sep, 2015 22:32 IST|Sakshi

కరీంనగర్: పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నావంటూ మావోయిస్టులు ఓ యువకుడ్ని హతమార్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఈటపల్లి తాలూకా గట్ట గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు ఉమేష్ (33) అనే యువకుడిని గొంతు కోసి హతమార్చారు.

పద్ధతి మార్చుకోవాలని పది సార్లు హెచ్చరించినా వినకపోవడం వల్లే ఉమేష్‌ను చంపినట్టు మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు.

మరిన్ని వార్తలు