ఇన్‌ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని చంపారు

2 Nov, 2015 10:57 IST|Sakshi

ఇన్‌ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను కాల్చిచంపారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ర్ట లోని అహేరీ తాలుకా చిన్నవడ్ర సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తెల్లవారు జామున గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు గిరిజనులను లాక్కెళ్లి కాల్చి చంపారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతోనే.. వీరిని చంపేశారని స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన గిరిజనులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు.


 

మరిన్ని వార్తలు