రూ.5లక్షల విలువైన గంజాయి పట్టివేత

29 Mar, 2016 16:55 IST|Sakshi

పాల్వంచ (ఖమ్మం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని పాల్వంచలో అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు.  ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు రావడం గమనించిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఓ టాటా సుమోను సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు