ఎరువుల డీలర్లకు సహకారం: హరీశ్‌

19 Apr, 2018 04:29 IST|Sakshi
డీలర్ల సంఘం అధ్యక్షుడు పృథ్వీని అభినందిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఎరువులు, విత్తన డీలర్లకు పూర్తి సహకారం అందిస్తామని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్ల సంఘం (స్పెడ్‌) రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పృథ్వీకి అభినందనలు తెలుపుతూ, రైతుల కోసం డీలర్ల సంఘం పనిచేయాలని మంత్రి సూచించారు. తమ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారని పృథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు