-

వివాహిత ఆత్మహత్య

20 Feb, 2015 10:15 IST|Sakshi

కతాలాపూర్: ఒంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకొని ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కతాలాపూర్ మండలం బోమ్మెన గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. బోమ్మెన గ్రామానికి చెందిన పడిగెల సుమలత గురువారం రాత్రి తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. విషయం తెలిసిన భర్త ఆమెను వెంటనే కోరుట్లలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు.

కాగా,చికిత్స పోందుతున్న ఆమె శుక్రవారం మరణించింది. సుమలతకు ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా,ఆమె ఆత్మాహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు