వివాహిత ఆత్మహత్య

25 Jan, 2016 17:53 IST|Sakshi

కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ధారూరు మండలం సర్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లలిత(25) అనే వివాహితకు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన లక్ష్మన్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహితకు తరుచూ కడుపునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురై అనారోగ్యంగా ఉండేది. ఈ బాధను భరించలేక ఆదివారం రాత్రి తల్లిగారి ఇంట్లోనే దులానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసకుంది. ఈమెకు కొడుకు హరిప్రసాద్, కూతురు శివానిలు ఉన్నారు. తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు