నగరంలో భారీ చోరీ

12 Apr, 2015 14:42 IST|Sakshi

హైదరాబాద్: మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌చందర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాన్ని రంపంతో కోసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 30 తులాలు బంగారం, 20 తులాల వెండి, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. స్థానికంగా నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ తన తల్లి పింఛన్ కోసం శుక్రవారం రాత్రి మెదక్ వెళ్లారు.

 ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి తాళం తీసి ఉండడాన్ని గుర్తించిన పాలుపోసే వ్యక్తి స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
 
 

మరిన్ని వార్తలు