ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

2 May, 2018 07:12 IST|Sakshi
జెండా ఆవిష్కరిస్తున్న టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు

రెబ్బెన : మండలంలోని గోలేటి, రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో గోలేటి టౌన్‌షిప్‌ లోని తెలంగాణ భవన్‌ వద్ద టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు ఎర్రజెండాను ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళి అర్పించారు. స్థానిక కేఎల్‌ మహేంద్రభవన్‌ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, సింగరేణి బస్టాండ్‌ వద్ద సీపీఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య,రమణారెడ్డి నగర్‌లో సీపీఐ సహాయ కార్యదర్శి కిషన్‌ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈసందర్భంగా పతాకాన్ని ఎగురవేసి అమరవీరులు నివాళులర్పించారు. గోలేటి ఎక్స్‌రోడ్‌ వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పొన్న శంకర్, రెబ్బెన మండల కేంద్రంలో మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపేందర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరో పించారు. కార్మిక సంఘాలు పోరా టాలతో సాధించిన కార్మిక చ ట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక లోకా నికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయ ని అన్నారు.

చికాగో అమరవీరుల పో రాట స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాడాలని సూచించారు.  కార్యక్రమాల్లో సిక్స్‌మె న్‌ కమిటీ సభ్యులు రాంరెడ్డి ,నాయకులు సాంబగౌడ్, చంద్రశేఖర్, కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, కిరణ్‌బాబు, సీపీఐ రెబ్బెన పట్టణ కార్యదర్శి శంకర్, నాయకులు అశోక్, దుర్గం తిరుపతి ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కా ర్యదర్శి దుర్గం రవీందర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు