సాక్షి, సిటీబ్యూరో: హరితహారం భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి బుధవారం బంజరాహిల్స్లోని తమ ఇంటి ప్రాంగణంలో మొక్క నాటారు. సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి చేసిన గ్రీన్ చాలెంజ్ను స్వీకరించి మొక్క నాటిన ఆమె.. ఈ సందర్భంగా ప్రముఖ నటి అమల, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్కుమార్కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగేంత వరకు సంరక్షించాలని కోరారు.