మేయర్‌ భార్య గ్రీన్‌ చాలెంజ్‌

23 Aug, 2018 09:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హరితహారం భాగంగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి బుధవారం బంజరాహిల్స్‌లోని తమ ఇంటి ప్రాంగణంలో మొక్క నాటారు. సనత్‌నగర్‌ కార్పొరేటర్‌ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి చేసిన గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించి మొక్క నాటిన ఆమె.. ఈ సందర్భంగా ప్రముఖ నటి అమల, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితారాణా, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగేంత వరకు సంరక్షించాలని కోరారు.

మరిన్ని వార్తలు