కరోనా వైరస్ కట్టడి విషయంలో ఒక్కో దేశం ఒక్కోలా వ్యవహరిస్తోంది.. పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే, ఆయా దేశాల్లోని ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? తమ ప్రభుత్వాలు సమర్థంగా వ్యవహరిస్తున్నాయి అని భావిస్తున్నారా? ఇలాంటి పలు రకాల ప్రశ్నలతో ప్రఖ్యాత గాలప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఇటీవల 17 దేశాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో తేలిందేమిటంటే.. కరోనా వైరస్ కట్టడిలో తమ ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని భావించేవారిలో భారతీయులు, మలేసియన్లు ముందున్నారట. కేంద్రం తీసుకుంటున్న చర్యలకు దేశంలోని 91 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారట. మన సంగతి సరే.. మరి మిగతా దేశాల్లో ఏమనుకుంటున్నారు.. ఓసారి చూసేద్దామా..
కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందా