50 ఎకరాలు అమ్ముకున్న మంత్రి ఎర్రబెల్లి

10 Dec, 2019 09:07 IST|Sakshi
మంత్రిని సన్మానిస్తున్న రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులు

కొడకండ్ల : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ కుటుంబానికి సంబంధించిన 50 ఎకరాల భూమిని విక్రయించారు. ఈ మేరకు భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు జనగామ జిల్లా కొడకండ్లలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సోమవారం వచ్చారు. పాలకుర్తి మండలం చెన్నూరులోని తన పేరిట ఉన్న భూమిని విక్రయించిన మంత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రాగా.. సబ్‌రిజిస్ట్రార్‌ విజయజ్యోతి, ఉద్యోగులు ఆయనను సన్మానించారు.

మరిన్ని వార్తలు