డిచ్‌పల్లి వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం

13 Feb, 2015 14:47 IST|Sakshi
డిచ్‌పల్లి వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం

డిచ్‌పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సారి ఆస్పత్రికి వచ్చే సరికి సేవలు మెరుగుపరచకుంటే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. తర్వాత డిచ్‌పల్లి, మండలంలోని తిరుమన్‌పల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు