లాక్‌డౌన్‌తో విద్యుత్ వినియోగం పెరిగింది

8 Jun, 2020 17:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్లాబుల్లో ఉన్న విధంగా బిల్లులు వస్తున్నాయని.. వాడిన దాని కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడా రాలేదని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్‌ వాడకం పెరుగుతుందని, లాక్‌డౌన్‌ కారణంగా 10-15 శాతం పెరిగిందని వివరించారు. గతంలో కంటే ఎక్కువగా బిల్లు వచ్చిందన అనుమానం ప్రజల్లో ఉందని.. కానీ వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రాలేదన్నారు. తుంగతుర్తి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలు కూడా బిల్లులు ఎక్కువ వచ్చాయని తన దృష్టికి తీసుకొచ్చారని, కానీ వారు వాడుకున్న మేరకే బిల్లులు వచ్చాయని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు