మంత్రి మహేందర్రెడ్డికి పితృ వియోగం

21 May, 2015 21:41 IST|Sakshi

షాబాద్(రంగారెడ్డి జిల్లా): రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలకు పితృవియోగం జరిగింది. వారి తండ్రి పట్నం మల్లారెడ్డి(88) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. షాబాద్ మండలంలోని ముద్దంగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన గొల్లూరుగూడ గ్రామంలో పేదరైతు కుటుంబంలో జన్మించిన మల్లారెడ్డి.. వ్యవసాయం చేసి కొడుకులు, కూతురును చదివించారు.

ఆయనకు భార్య రుక్కమ్మ, కుమారులు దివంగత రాజేందర్‌రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కూతురు నర్మదారెడ్డిలు ఉన్నారు. గత కొంత కాలంగా మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి కన్నుమూశారు.

మరిన్ని వార్తలు