యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహుడిని తెలంగాణ మంత్రులు మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ ఆర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం బాలాలయ మండపంలో అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.