సీఎం దగ్గర నాకే ఎక్స్‌పోజర్‌ దక్కింది: మంత్రి

2 Jan, 2020 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీని ఎవరైతే ఖతం చేయాలని అనుకున్నారో వారే ఖతమయ్యారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ ఆర్టీసీపై బస్‌భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర తనకే ఎక్స్‌పోజర్‌ దక్కిందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ అంటే ఎవరికీ తెలియదని, తాను రవాణా శాఖ మంత్రిగా రాగానే ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చిందన్నారు. అదే విధంగా బస్‌భవన్‌కు రాగానే తనకు సమ్మె నోటిసు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు