సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం

8 Sep, 2016 05:12 IST|Sakshi
సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం

- నేను ఏ జిల్లాకు బాధ్యుడ్ని అవుతానో తెలియదు
- మంత్రి ఈటల రాజేందర్

హన్మకొండ: తన ప్రాంతం వరంగల్ జిల్లాలో కలిసినా.. తాను ఈ ప్రాంతానికి వస్తానని... కాదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హన్మకొండలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను ఏ జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. 17 మంది మంత్రులుంటే 27 జిల్లాలు అవుతున్నాయని, ఈ క్రమంలో ఎవరికి ఏయే జిల్లాలు కేటాయిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.  కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్నారు.

మరిన్ని వార్తలు