మేడారం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

11 Jan, 2016 12:52 IST|Sakshi

మేడారం జాతర కోసం వస్తున్న భక్తుల ఏర్పాట్లపై ఆర్టీసీ ఆధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర కోసం 51 ప్రాంతాల నుంచి 3,700 బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మేడారం వెళ్లే బస్సులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. తెలంగాణలో బస్సురూట్ లేని 1300 గ్రామాలను గుర్తించామని.. త్వరలోనే ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.



 

>
మరిన్ని వార్తలు