మైనర్ పై అత్యాచారం

11 Mar, 2016 19:10 IST|Sakshi

హైదరాబాద్ : బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 'ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా.. నీకో విషయం చెప్తాను' అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది.

స్థానికంగా నివాసముంటున్న బాలిక(12)పై అదే ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హరీష్(22) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు