మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ గౌస్, సెక్రటరీ కొండవీటి సత్యం మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నాళ్లుగా తాము తెలుగు దేశం పార్టీకోసం అధికారం ఉన్నా, లేకపోయినా నిరంతరం పార్టీ కోసమే పనిచేశామన్నారు. కానీ చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్తో కలిసి పనిచేయలేకనే టీడీపీకి రాజీ నామ చేశామన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్రావును ఈ ఎన్నికల్లో మరోసారి గెలిపించుకునేందుకు తాము కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ అత్తి సరోజ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి...
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు.వారు మాట్లాడుతూ ప్రేంసాగర్రావుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, అందుకే తాము కాంగ్రెస్లో చేరామన్నారు.
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సింగాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు సాంబారి కుటుం బరావు, బౌకం కనకరాజు ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ బర్ల రవి, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్సాగర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుళ్లా పనిచేయాలన్నారు.