వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసి శ్రమిద్దామని నేతలు, కార్యకర్తలకు సూచించారు. లోటస్పాండ్లో తెలంగాణ వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని వైఎస్ విజయమ్మ ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్ఆర్సీపీ ఉవ్వెత్తున ఎగసిపడేలా పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అందరం కష్టపడి పనిచేద్దామని, తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలోనూ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని పొంగులేటి చెప్పారు. మిగిలిన రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించేలా ఫలితాలు సాధిద్దామని నాయకులకు పిలుపునిచ్చారు.