శ్రీమతి కరీంనగర్‌గా రాజశ్రీ

16 Apr, 2018 11:55 IST|Sakshi

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): క్యాట్‌వాక్‌లు.. జడ్జిల ప్రశ్నలు..కళ్లు చెదిరే సమాధానాలు...అదిరేటి స్టెప్పులు..కోకిల గొంతులు ఇలా కరీంనగర్‌లో ఆదివారం కరీంనగర్‌ జిల్లా శ్రీమతులు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. శ్రీమతి తెలంగాణ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తుండగా ఆడిషన్స్‌కు కరీంనగర్‌ వేదికైంది. స్థానిక శ్వేత హోటల్‌లో జరిగిన ఆడిషన్స్‌కు పెద్దసంఖ్యలో శ్రీమతులు పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అచ్చు మిస్‌ యూనివర్స్‌ పోటీలను తలపించేలా కార్యక్రమం సాగింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ హాజరై విజేతకు కిరిటాన్ని తొడిగారు.

మరిన్ని వార్తలు