'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు'

17 May, 2016 17:20 IST|Sakshi

పుల్కల్: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం చక్రియాల్‌లో మిషన్ కాకతీయ పనులను అయన ప్రారంభించారు. కామని చెరువుకు రూ.27 లక్షలు, నల్లకుంటకు రూ.23 లక్షలతో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనులు చేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు