సింగరేణి బోనస్‌పై జలగం హర్షం

21 Sep, 2017 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ గా రూ.25 వేలు ప్రకటిం చడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతేడాది రూ.18 వేలుగా ఉన్న ఈ బోనస్‌ను రూ.7వేలు పెంచి ఈ సారి రూ.25 వేలుగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు కార్మికులపై ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శమని.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జలగం వెల్లడించారు.

మరిన్ని వార్తలు