రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా

25 Jun, 2020 13:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్‌మెన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం మరో ఐదుగురు సిబ్బందికి సంబంధించిన రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్‌, బీగాల గణేష్‌ గుప్తాకు సైతం వైరస్‌ సోకింది.

చదవండి : రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం

మరిన్ని వార్తలు