మొబైల్‌ ఏటీఎం ప్రారంభం

3 Jul, 2018 13:30 IST|Sakshi
ఏటీఎంను ప్రారంభిస్తున్న చైర్మన్, మేనేజర్‌  

బీబీనగర్‌ :  మండలంలోని బీబీనగర్, కొండమడుగు, గూడురు గ్రామాల్లో సోమవారం నాబార్డు వారి సౌజన్యంతో, పీఏసీఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ ఏటీఎంను పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్‌ సేవలు, నగదు అందుబాటులో ఉండే విధంగా మొబైల్‌ ఏటీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఇందిరాప్రియదర్శిని, పీఏసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు