అయ్యో పాపం మూగజీవాలు..

10 Jul, 2018 10:52 IST|Sakshi
విద్యుత్‌ స్తంభంపై కోతులు

భద్రాద్రి కొత్తగూడెం : ఏదైనా ప్రమాదం జరిగితే నోరు విప్పి చెప్పుకోలేవు.. ఈ చిత్రాలు చూడండి.. వామ్మో.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. ప్రాణాలతో ఉంటాయా..? అసలే వర్షాకాలం.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఎవరి ప్రాణాలైనా అంతే సంగతులు..

కొన్ని వానరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్‌ డిపోలోని ఓ షెడ్‌లోకి వచ్చాయి. అక్కడ విద్యుత్‌ స్విచ్‌ బాక్స్‌ శిథిలమై ఉంది.. కానీ దాన్ని గమనించక కోతులు స్తంభంపైకి ఎక్కుతూ కనిపించాయి.. బయటకు వచ్చి ఉన్న తీగలు ప్రమాదకరంగా ఉండడంతో వాటి నుండి తప్పించుకోడానికి నానా తిప్పలు పడ్డాయి. ఈ దృశ్యాలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌ మనిపించింది.. 

మరిన్ని వార్తలు