దుప్పి మాంసం స్వాధీనం

12 Mar, 2016 01:35 IST|Sakshi

లింగాల : మండలంలోని రాయవరంలో శుక్రవారం రెండు కిలోల దుప్పి మాంసాన్ని అటవీశాఖ అధికారి చంద్రమౌళి స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దుప్పి మాంసం వండిన ఈ గ్రామానికి చెందిన శంకర్, వెంకటయ్యలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడం చట్ట విరుద్ధమని పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు