వాగులో పడి తల్లీకూతుళ్లు మృతి

17 Jun, 2015 20:18 IST|Sakshi

వరంగల్: పనిమీద పొరుగూరికి వెళ్తున్న తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందిన సంఘటన జిల్లాలోని రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు ఆముదాల రాజమల్లమ్మ(60), వనిత(32) కాలినడకన గ్రామం నుంచి కనిపర్తికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న చలివాగు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇసుక గుంటలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు