తల్లీపిల్లలు అదృశ్యం

4 Mar, 2016 17:19 IST|Sakshi

హైదరాబాద్ : తల్లీ పిల్లలు అదృశ్యమైన ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లికి చెందిన జంగయ్య, లక్ష్మి(23) దంపతులు పని రీత్యా సైదాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి లోకేశ్(4), చరణ్(1) అనే ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య ఈ నడుమ గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 28 న లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె జాడ లేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు శుక్రవారం సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు