కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి

20 Apr, 2019 12:36 IST|Sakshi

నంగునూరు(సిద్దిపేట): పేగు తెంచుకొని పుట్టిన కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన సంఘటన శుక్రవారం నంగునూరు ప్రజలను కలిచివేసింది. గ్రామానికి చెందిన గౌరబోయిన నందు నర్మేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం గ్రామానికి చేరుకున్న నందు మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. శుక్రవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా నందు అవివాహితుడు కావడం, తండ్రి గతంలోనే మృతిచెందడంతో తల్లి స్వప్న అంత్యక్రియలు నిర్వహించింది.

కన్న కొడుకుకు తల్లి దహన సంస్కారాలు నిర్వహించడం చూసి చలించిన మహిళలు, స్నేహితులు బోరున విలపించారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ నంగునూరులో కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. నిరుపేదలైన నందు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

మరిన్ని వార్తలు