తెలంగాణలో టీడీపీ భూస్థాపితం: మోత్కుపల్లి

7 Apr, 2019 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం భూస్థాపితమవుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ‘బాబు ఓ అసమర్థుడు. ఆయనకు ఏపీలోనే దిక్కులేదు, ఇక తెలంగాణకు ఏం చేయగలడు’అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలంతా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని, సీఎం పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు