ఎస్సీడబ్ల్యూయూ పదవికి ఎంపీ కవిత రాజీనామా

2 Feb, 2019 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గు కార్మిక సంఘం (ఎస్సీడబ్ల్యూయూ)తో పాటు వివిధ సంఘాల గౌరవాధ్యక్ష పదవులకు శనివారం రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని హరీష్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు