ఖమ్మంలో ఎంపీ కవిత పర్యటన

18 Dec, 2017 14:02 IST|Sakshi

ఐటీ హబ్‌ పనుల పరిశీలన

సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత స్ఫష్టం చేశారు. సోమవారం ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. దాంతో పాటు ఆమె నగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు మరో మూడు జిల్లాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు