దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి

1 May, 2018 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన...బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేపడుతున్న చర్యల గురించి దలైలామాతో ప్రత్యేకంగా చర్చించినట్లు ఎంపీ ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మల్లారెడ్డి వెంట సామాజిక న్యాయం, సాధికారత శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌ రమేశ్‌ బేయాస్, ఇతర కమిటీ సభ్యులున్నారు.  

మరిన్ని వార్తలు