‘కరోనా’బాధితురాలు ఉన్న హోటల్ పరిశీలన
కుత్బుల్లాపూర్: ఇటలీకి వెళ్లి వచ్చిన ఓ మహిళ కొంపల్లి జాతీయ రహదారి సినీ ప్లానెట్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో మూడు రోజుల పాటు బస చేసి వెళ్లి గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో బాధ పడుతూ చేరడం స్థానికంగా కలకలం రేపింది. ఇదే విషయంపై జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో బుధవారం హోటల్ను సందర్శించి ఆమె ఉన్న గదిని పరిశీలించారు. హోటల్ అధికారులు సహకరించకపోవడంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి జోక్యం చేసుకుని పేట్ బషీరాబాద్ ఎస్ఐ పురుషోత్తమ్తో కలిసి ఆమె బస చేసిన హోటల్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.