డెంగ్యూతో కార్మికుడు మృతి

24 Oct, 2015 17:44 IST|Sakshi

వనపర్తి టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వనపర్తి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోర్ల చిన్న మన్యం(42) శుక్రవారం రాత్రి డెంగ్యూతో మృతిచెందాడు. మన్యానికి రెండు నెలల కిందట డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దసరా పండుగకు ఇంటికి వెళదామని పట్టుబట్టడంతో రెండు రోజుల క్రితం వనపర్తికి తీసుకొచ్చారు. కాగా శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. అతడికి భార్య చెన్నమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు