చెక్‌పవర్‌ కోసం భిక్షాటన..!

13 Jun, 2019 17:02 IST|Sakshi

సాక్షి, నల్గొండ : సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి 4 నెలలు దాటినా చెక్‌పవర్‌ లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో పడిపోయామని జిల్లాలోని మునుగోడు సర్పంచ్‌ మిర్యాల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. వీలేనంత త్వరగా ప్రభుత్వం స్పందించి చెక్‌పవర్‌ ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు ఆయనకు మద్దతుగా నిలిచారు. చెక్‌పవర్‌ జీవోను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు