లారీఓనర్ ను చంపిన డ్రైవర్

3 Feb, 2015 12:22 IST|Sakshi

కరీంనగర్: డబ్బుల విషయంలో వచ్చిన పొరపొచ్చలు ఒకరి ప్రాణం తీశాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్ వద్ద జరిగింది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ కుమార్ తన యజమాని గాలి సంపత్‌రావు(35)తో వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు.

ఆగ్రహంతో ఊగిపోయిన లారీ డ్రైవర్ అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పారతో యజమాని తల మీద బలంగా మోదాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్తానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంపత్‌రావు మృతిచెందాడు.
(సుల్తానాబాద్)

మరిన్ని వార్తలు