శంషాబాద్లో ఇద్దరిపై హత్యాయత్నం; తీవ్రగాయాలు

8 Mar, 2015 18:11 IST|Sakshi

రంగారెడ్డి: బైక్పై వెళుతున్న ఇద్దరి వ్యక్తులపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం మన్మర్రిలో ఆదివారం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో బైక్పై వెళుతున్న రాఘవేంద్రరెడ్డి, నరేష్ అనే ఇద్దరి వ్యక్తులను నర్సింహారెడ్డి అనే వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వారి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు