కేసీఆర్‌కు అది అలవాటే

12 Mar, 2017 18:14 IST|Sakshi
కేసీఆర్‌కు అది అలవాటే

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుది పర్సెంటేజీల ప్రభుత్వమని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ప్రతి పనిలో పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని నాగం సవాల్ విసిరారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మాట ఇచ్చి తప్పడం కేసీఆర్‌కు అలవాటేనని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు