ఉక్కుమనిషి పట్ల ఇదా గౌరవం!: నాగం

1 Nov, 2014 02:48 IST|Sakshi
ఉక్కుమనిషి పట్ల ఇదా గౌరవం!: నాగం

సీఎం కేసీఆర్‌ను నిలదీసిన నాగం
 హైదరాబాద్:  నిజాం చెర నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొనకుండా సీఎం కె.చంద్రశేఖరరావు అనుచిత ధోరణితో వ్యవహరించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో  మాట్లాడారు. సీఎంకు  పటేల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక లేదా అని ప్రశ్నించారు. అక్టోబర్ 31న జాతీయ ఏక్తాదివస్ పాటించాలని అన్ని విభాగాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ దాన్ని తానే ఎందుకు ఉల్లంఘించారని విమర్శించారు.

మరిన్ని వార్తలు