రేపు సాగర్‌ గేట్లు ఎత్తనున్న ఇరు రాష్ట్రాల మంత్రులు

10 Aug, 2019 19:46 IST|Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌ : రెండు రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌ రెడ్డితో కలిసి సంయుక్తంగా సాగర్‌ కుడి, ఎడమ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం ఎల్‌.ఎల్‌.సి, ఎంఆర్‌ కాలువల ద్వారా మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మంత్రి జగదీష్‌ నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు  
 

మరిన్ని వార్తలు