ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదు

28 Oct, 2018 04:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ టౌన్‌ మెయిన్‌ రోడ్డులో ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అనుమతినివ్వలేదని ఆ జిల్లా పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అంతేకాక సంబంధిత అధికారుల నుంచి అనుమతి లేకుండా ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రణయ్‌ తండ్రికి స్పష్టం చేశామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. 
 

మరిన్ని వార్తలు