ఐదారు వేల జీతానికే వెట్టి చాకిరి..

8 Dec, 2017 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నారాయణ విద్యాసంస్థలో పనిచేసే జూనియర్‌ లెక్చరర్లు ఆందోలనకు దిగిన విషయం తెలిసేందే. కనీసం వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని యజమాన్యాన్ని కోరారు. గత 21 రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, పుల్లారెడ్డి బ్రాంచ్‌లలో జూనియర్‌ లెక్చర​ర్లు మహా ధర్నాకు దిగారు.

ఐదారు వేల జీతానికే తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని వారు మండిపడ్డారు. తాము పడుతున్న కష్టాన్ని చూసైనా యజమాన్యం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక ప్రస్తుతం పనివేళలు అధికంగా ఉన్నాయని.. వాటిని 8 గంటలకు అమలు చేయాలని జూనియర్‌ లెక్చరర్లు ధర్నా చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు