రైల్వే ఛార్జీలు పెంచడం మోడీకి ఇష్టం లేదు: కిషన్ రెడ్డి

21 Jun, 2014 18:26 IST|Sakshi
రైల్వే ఛార్జీలు పెంచడం మోడీకి ఇష్టం లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: రైల్వే ఛార్జీలు పెంచడం ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టంలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అలాగే సిమెంట్ ధరలు పెంచడం ఏకపక్షమేనని, ధరల పెంపు ప్రజలకు భారంగా మారుతుందని కిషన్ రెడ్డి అన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నెలకొన్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పంద రద్దు, ఇతర అంశాలపై కిషన్ రెడ్డి స్పందించారు.  విద్యుత్, నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు సానుకూలంగా చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. 
మరిన్ని వార్తలు